ఆడవారిలో బరువు తగ్గాలంటే ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. మొత్తం పొట్ట అంతా లాగేస్తుంది.

ఆడవారిలో చిన్న వారి నుంచి పెద్దవారు వరకు ప్రస్తుత కాలంలో ఓబైసిటీతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. వీరు బరువు ఎందుకు పెరుగుతున్నారు అని ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి కూడా గురి అవుతూ ఉంటున్నారు. దీనికోసం రైస్ తినడం మానేసి చపాతీలు తింటూ బరువు ఇంకా తగ్గటం లేదని బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఒక విషయం ఆలోచిస్తే రైస్ తినే వారు కూడా చాలామంది సన్నంగానే ఉంటారు. వారు రైస్ తింటున్న బరువు పెరగరు. అందువలన రైస్ తినడం మానేసినంత మాత్రాన బరువు తగ్గరు.

మనం బరువు పెరుగుతున్నాము అంటే దానికి కారణం మనం తిన్న క్యాలరీస్ కరిగించుకోకపోవడం. మన ఆహారం ఎక్కువగా తీసుకుని తక్కువ పని చేయకపోవడం వలన మన శరీరంలోని క్యాలరీస్ కరగవు. దీనివలన శరీరంలోని గ్లూకోజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. తద్వారా బరువు పెరుగుతారు. దీనికోసం మనం ఎన్ని క్యాలరీస్ తింటున్నాం. ఎన్ని క్యాలరీస్ కరిగించుకుంటున్నామనేది చెక్ చేసుకోవాలి. ఇది మనం తెలుసుకోలేము. కనుక మంచి న్యూట్రిషన్ హెల్ప్ తీసుకోవాలి. ఆడవారు ఉదయం లేచిన తర్వాత నుంచి పడుకునే అంతవరకు కష్టపడుతూనే ఉంటున్నాం. అయినా బరువు తగ్గట్లేదు అని అనుకుంటూ ఉంటున్నారు.

కానీ మనం ఇంట్లో పని కొంచెం చేసి కొంత సేపు రిలాక్స్ అయ్యి మరలా మిగతా పని చేసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఆహారం కూడా ఎక్కువసార్లు తీసుకుంటు ఉంటాం. అందువలన త్వరగా బరువు పెరుగుతున్నాం. కనుక ముందుగా మన డైట్ లో మార్పు చేసుకోవాలి. అంతేకాకుండా మనం తినే ఆహారంలో నూనె, ఉప్పు తగ్గించుకోవాలి. మనము తీసుకునే క్యాలరీలు తక్కువగా ఉంటూ మనం ఖర్చు పెట్టే క్యాలరీలు ఎక్కువగా ఉంటే బరువు త్వరగా తగ్గుతం. దీంతోపాటు రోజు ఉదయం లేవగానే వ్యాయామాలు చేయాలి.

ఇలా చేయడం వల్ల రోజంతా మనం యాక్టివ్ గా ఉండడంతో పాటు మన క్యాలరీస్ కూడా కరుగుతాయి. అంతేకాకుండా నాన్ వెజ్ తినడం తగ్గించాలి. ఈ విధంగా మనం తీసుకునే ఆహారంలో మార్పు చేసుకుంటూ రాత్రి సమయంలో ఆరు, ఏడు గంటల లోపు మన ఆహారం తినడం ముగించాలి. ఇలా చేయడం ద్వారా మనం బరువు పెరగము. ఇలా మన డైట్ లో మార్పు చేసుకుని రోజు వ్యాయామాలు చేస్తూ సరిపడ నీటిని తీసుకోవడం ద్వారా అధిక బరువు సమస్య నుంచి విడుదల పొందవచ్చు.