బాధ్యత గల వృత్తిలో ఉన్న కొందరు పోలీస్ అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తూ, పోలీసు వృత్తికే మచ్చ తెస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలతో ఎఫైర్స్ పెట్టుకోవడం, కోరిక తీర్చకపోతే వేధించడం వంటి ఘటనలు గతంలో మనం అనేకం చూసాం.
అయితే అచ్చం ఇలాంటి ఘటన తాజాగా రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఇద్దరూ కానిస్టేబుళ్లు గదిలోకి ఒక మహిళను తీసుకువెళ్లి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, రొమాన్స్ చేశారు. అంతే కాకుండా ఇదంతా సెల్ఫోన్లో వీడియో కూడా తీసుకున్నారు. ఇదే వీడియో వైరల్ గా మారి చివరికి పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో, వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం రాజస్థాన్ ఉదయపూర్ పరిధిలోని లజడియ పోలీస్ స్టేషన్లో లోకేష్ కుమార్, సురేంద్ర సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఈ అధికారులు పోలీసు వృత్తికే మచ్చ తెచ్చే పని చేశారు. ఏకంగా ఒక మహిళను ముగ్గులోకి దించుకున్నారు. అంతేకాకుండా ఆమెను గదిలోకి తీసుకువెళ్లి ఆమెతో రొమాన్స్ కు తేర లేపారు.
వీరిద్దరితో పాటు ఒక లాయర్ కూడా ఉన్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఆ మహిళతో సరసాలకు దిగి వీడియో కూడా తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అధి కాస్తా వైరల్ గా మారి చివరికి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే లోకేష్ కుమార్ సురేంద్ర సింగ్ కానిస్టేబుల్ అని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీ అంశం గా మారింది. బాధ్యత గల బాధ్యత గల వృత్తిలో ఉండి పరాయి మహిళతో రొమాన్స్కు తెర లేపిన ఈ కానిస్టేబుల్ వ్యవహారంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.