గరుడ పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి వివరించారు. మనిషి జీవించి ఉండగా వారు ఉపయోగించిన కొన్ని వస్తువులను మనము ఉపయోగించకూడదు అని, ఎవరు పుట్టినా కూడా వారిని వారి మరణము అనేది కాయము అనేది ప్రకృతి యొక్క ధర్మము అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు.
మరణము అనేది ఎవ్వరూ కూడా కాదు అనలేని సత్యము, మరణం దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి తప్పనిసరిగా తన శరీరాన్ని వదులుకోవాలి. మరియు శరీరంతో పాటు అతను కొన్ని భౌతిక వస్తువులను కూడా వదులుకోవాల్సి వస్తుంది. మరణానంతరం ఒక వ్యక్తి భౌతిక వస్తువులను వారితో తీసుకు వెళ్లలేరు, వారు పాపాలు మరియు పుణ్యాలను మాత్రమే వారితో తీసుకొని వెళ్తారు.
ఒక వ్యక్తి తన జీవితకాలంలో చెడు పనుల కంటే ఎక్కువ మంచి పనులనే చేసినట్లయితే, మరణ సమయంలో వారికి ఎటువంటి కష్టాలు కూడా ఉండవు. మరియు వారి ఆత్మ సహజంగా శరీరాన్ని వదిలివేస్తుంది. అంటే వారికి చాలా సునాయాస మరణము అనేది సంభవిస్తుంది అని అర్థం. ఒక వ్యక్తి తన జీవితకాలంలో పుణ్యం కంటే, ఎక్కువ పాపాలను చేసినట్లయితే వారి మరణము చాలా బాధాకరమైనది. మరియు మరణ సమయంలో వారు చాలా బాధలు భరించవలసి ఉంటుంది. యమదూతలు అటువంటి వారిపై అస్సలు కనికరాన్ని చూపించరు.
వారిని తాళ్లతో కట్టి యమలోకానికి తీసుకొని వెళతారు, పాపాత్ములు యమలోకానికి వెళ్లే మార్గంలో ఉన్నప్పుడు, అతను చాలా బాధలను అనుభవిస్తాడు. అతడు ఏడుస్తూ నరక మార్గంలో నడుస్తాడు, కానీ యమదూతలు అతనిపై కనికరమే చూపించరు. మరియు వారికి మరింత బాధను కలిగిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఆత్మకు సొంతము అనేది ఏదీ లేదు, శ్రీకృష్ణుడు చెప్పాడు ఆత్మ శాశ్వతమైనది మరియు అంతము లేనిది అదే, ఆత్మ చర్యలకు అనుగుణంగా పదే పదే జన్మిస్తూ ఉంటుంది. మానవ శరీరం కూడా తాను సొంతము కాదు, అది కూడా భగవంతుడి దయతో కొద్ది కాలానికి మాత్రమే లభిస్తుంది. అది ఒక రోజు పంచభూతాలలో కలిసిపోతుంది.
మరణం తర్వాత కూడా వ్యక్తి ఈ భౌతిక వస్తువులతో తన విషయాలపై ఉన్న అనుబంధాన్ని విడిచిపెట్టి, భగవంతుడికి పూర్తిగా లొంగనంత కాలం కూడా, ప్రతి వ్యక్తి కూడా భూమిపై వివిధ రూపాలలో వివిధ జాతులలో సంచరిస్తూనే ఉంటారు, అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కొన్నిసార్లు మరణం తర్వాత కూడా వ్యక్తి భూలోకంలోనే సంచరిస్తూ ఉంటాడు, అంటే తాను ప్రీతంగా మారుతాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.